విశాఖలో వెలుగులోకి వచ్చిన భూముల రికార్డుల తారుమారు వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాసరావుపై మరో మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేయడం తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టింది. సిట్ అధికారులను కలిసిన అయ్యన్నపాత్రుడు, మొత్తం వ్యవహారంలో గంటా, ఆయన బంధువుల పాత్రపై తన వద్ద ఉన్న ఆధారాలను అందించిన సంగతి తెలిసిందే. ఇక, బుధవారం నాడు అధికారులను కలిసి మరిన్ని ఆధారాలు ఇస్తానని అయ్యన్నపాత్రుడు ప్రకటించడంతో, గంటా వర్గంలో ఆందోళన పెరిగింది.ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం గంటా హుటాహుటిన విజయవాడకు బయలుదేరగా, సీఎం చంద్రబాబును కలిసేందుకే ఆయన వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, గంటాకు అత్యంత సమీప బంధువైన పరుచూరి భాస్కర రావు, ప్రభుత్వ భూములను తమవిగా చూపించి, ఇండియన్ బ్యాంకు నుంచి రూ. 190 కోట్ల రుణాన్ని తీసుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. గంటాకు సన్నిహితుడైన అనకాపల్లి శాసనసభ్యుడు పీలా గోవింద సత్యనారాయణపైనా ఆయన ఆరోపణలు గుప్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa