ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచిన్ ట్వీట్ కు కౌంటరిచ్చిన లాయర్..

national |  Suryaa Desk  | Published : Thu, Feb 04, 2021, 05:31 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనల్లో అంతర్జాతీయ సెలబ్రిటీలు తలదూర్చడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు భారత ప్రముఖులు ట్వీట్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ చేసిన ట్వీట్ కు ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ కౌంటర్ ఇచ్చారు. 'రైతుల దీక్షలో కరెంట్, నీళ్లు, ఇంటర్నెట్ సేవలను కట్ చేసినప్పుడు, బీజేపీ మద్దతుదారులు రాళ్లు విసిరినప్పుడు వీళ్లంతా ఏమయ్యారు? రిహాన్నా, గ్రెటా ట్వీట్లు చేసే సరికి అందరూ నోళ్లు తెరుస్తున్నారు. వీళ్లంతా వెన్నెముక లేని, మనసులేని సర్కారు సెలబ్రిటీలు' అని కౌంటర్ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa