ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 04, 2021, 05:55 PM

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. తొలివిడతలో మొత్తం 1315 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో కొన్ని పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవాల కోసం నామినేషన్ల ఉపసంహరణపై వైసీపీ నేతలు దృష్టి పెట్టగా.. అభ్యర్థుల్ని ఎలాగైనా బరిలో ఉంచేలా చూడాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
రెండో విడత నామినేషన్ల దాఖలుకు ఈరోజే చివరి రోజు. రెండోవిడతలో 3335 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు రెడీ అవుతున్నాయి. ఎన్నికలు జరిగిన రోజునే కౌంటింగ్‌ ఉండటంతో ఈసారి బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచే అవకాశం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa