ఏపీలోని చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ ఏకగ్రీవాలు రావడంపై ఎస్ఈసీ అనుమానం వ్యక్తం చేశారు. ఏకగ్రీవాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు ప్రకటించొద్దన్నారు. మొదటి విడతలో చిత్తూరులో 110, గుంటూరులో 67 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాలను గుడ్డిగా ఆమోదించమని ఎస్ఈసీ ఇదివరకే స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa