పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సోమవారం రాజ్యసభలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ప్రతిపక్షనేత (కాంగ్రెస్) గులాంనబీ అజాద్పై ప్రశంసల వర్షం కురిపించారు. విపక్షంలో ఉన్నప్పటికీ ఆజాద్ ఎంతో హుందాగా మాట్లాడుతారని, ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నట్లు మోదీ తెలిపారు. అంతేకాకుండా సభలో కొత్తగా అడుగుపెట్టేవారు అజాద్ నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు.
ఇటీవల జమ్మూకశ్మీర్లో జరిగిన స్థానిక ఎన్నికల గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడంలో గులాంనబీ అజాద్ కీలక పాత్ర పోషించారని పొగడ్తలతో ముంచెత్తారు. మోదీ ప్రసంగంతో అధికార పక్షంతో పాటు విపక్ష సభ్యులు సైతం అశ్చర్యానికి గురయ్యారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మోదీ ప్రసంగించారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీపై తిరుగుబాటు లేఖ సందించిన సీనియర్లలో గులాంనబీ అజాద్ ఒకరు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో ప్రధాని మోదీ అజాద్పై ప్రశంసలు కురిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa