ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

national |  Suryaa Desk  | Published : Tue, Feb 09, 2021, 11:51 AM

ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జౌనపుర్ జిల్లా జలాల్‌పుర్ వద్ద ట్రక్కు - జీపు ఢీకొన్నాయి. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగం, నిద్రమత్తు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వారణాసి నుంచి జౌనపుర్ వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa