వైసీపీకి వ్యతిరేకంగా ఎవరు నామినేషన్ వేసినా వారికి సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని గురువారం పెడన శాసనసభ్యులు జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తీసుకొని ఎవరైనా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వార్డ్ మెంబర్ గా పోటీ చేసినట్లయితే వారి ఇంట్లో ఉన్న అమ్మ ఒడి, పెన్షను, కాపు నేస్తం పథకాలను కట్ చేస్తామని జోగి రమేష్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను బెదిరించే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ శాసనసభ్యులు జోగి రమేష్ కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుంచి నోటీసులు పంపారు. ఈనెల 17వ తేదీ వరకు మీడియాతో మాట్లాడవద్దని జోగికి ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఎటువంటి సభలు సమావేశాల్లో పాల్గొనకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే జోగి రమేష్ గురించి మూడు పార్టీలకు సంబంధించిన వారు ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదులు అందజేశారు. వారి ఫిర్యాదుల మేరకు ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్.ఈ.సి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa