ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో భవనాల నిర్మాణంపై కమిటీ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 12, 2021, 04:52 PM

రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణంపై సీఎస్ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం సమావేశమైంది. శాసన రాజధానికి సంబంధించిన అసంపూర్తి భవనాల నిర్మాణంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో 9 సభ్యులతో కమిటీ వేసింది. ఈరోజు కమిటీ సమావేశమై.. రాజధాని ప్రాంతంలోని అసంపూర్తి భవనాల నిర్మాణానికి అవసరమైన నిధుల అంచనాపై సమీక్ష నిర్వహించింది. మొత్తంగా అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణానికి రూ. 2154 కోట్లు నిధుల అవసరమని, ప్రస్తుతం కాంట్రాక్టర్ల చెల్లింపుల నిమిత్తం సుమారు రూ. 300 కోట్లు అవసరమని కమిటీ భావించింది. అసంపూర్తి నిర్మాణాలు, నిధుల సమీకరణ విషయంలో బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో సమావేశమవ్వాలని ఎమ్మార్డీఏని కమిటీ ఆదేశించింది. 70 శాతానికి పైగా పూర్తైన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కమిటీ అభిప్రాయపడింది. మార్చి రెండో వారంలో రెండో సారి భేటీ కావాలని నిర్ణయానికి వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa