ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రవ్యాప్త ఆందోళనకు టీడీపీ పిలుపు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 15, 2021, 03:28 PM

విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 18న టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. కేసుల మాఫీ కోసమే జగన్‌ విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తున్నారని, పోస్కోతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని, స్టీల్ ‌ప్లాంట్‌ మిగులు భూమిని కాజేసేందుకు కేంద్రం ఎదుట మోకరిల్లారని అన్నారు.
స్టీల్‌ ప్లాంట్‌ ను నిర్వీర్యం చేయాలని చూస్తున్న వైసీపీ ప్రభుత్వ కుట్రలను తెలుగు ప్రజలు ఉక్కు సంకల్పంతో ఎదుర్కోవాలని, తెలుగు ప్రజల ముందు జగన్‌ కుట్రలు సాగవని చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా టీడీపీ సిద్ధంగా ఉందని, పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీలు నిర్వహించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa