అమరావతి: తిరుపతిలో కాంగ్రెస్ గెలుపు...రాష్ట్ర ప్రగతికి మలుపని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ తులసీరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంజీవిని లాంటి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ పాడి ఆవు లాంటిదని, కొన్ని పార్టీలు వట్టి పొయినవని, మరికొన్ని గొడ్డు ఆవులాంటివని అన్నారు. పచ్చిగడ్డి లాంటి ఓటును పాడి ఆవుకు వేసి పాలు పిండికోవాలన్నారు. దుగరాజపట్నం మేజర్ ఓడరేవు కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. అలాగే మన్నవరం, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ పునరుద్ధరణ కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. శ్రీసిటీ నిర్మాణం, శ్రీహరి కోట భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం కాంగ్రెస్ మానసపుత్రికలని తులసీరెడ్డి అభివర్ణించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa