ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పధకాలు: మంత్రి వెల్లంపల్లి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 15, 2021, 05:07 PM

విజయవాడ: వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తూర్పు నియోజకవర్గ వాలేంటీర్ల సేవలకు సత్కార వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లితో పాటు వైసీపీ నేత దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్య లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాలంటీర్లు సేవ చేశారని పొగిడారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు మెచ్చుకునేలా వాలంటీర్ల పనితీరు ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మీ మీద పెట్టుకున్న నమ్మ కాన్ని ఓమ్ము చేయకుండా పని చేస్తున్నారని, ఏ సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa