ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోణీ కొట్టిన రాజస్థాన్.. ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్టరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 16, 2021, 07:54 AM

ఐపీఎల్ -14 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. ముంబై లోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (51) ఒంటరి పోరాటం చేశాడు. రాజస్థాన్‌ బౌలర్లలో ఉనాద్కత్‌ 3, ముస్తఫిజుర్‌ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 3, వోక్స్‌, రబడ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఉనాద్కత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఛేదనలో రాజస్థాన్‌ ఆరంభం నుంచే తడబడింది. మనన్‌ వోహ్రా (9), బట్లర్‌ (2), కెప్టెన్‌ శాంసన్‌ (4), శివం దూబే (2), రియాన్‌ పరాగ్‌ (2) ఇలా వచ్చి అలా వెళ్లారు. మోరిస్‌ (36*), మిల్లర్‌ (62) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ కు తొలి విజయం దక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa