తాను చేస్తున్న పాడు పనిని ప్రశ్నించాడని కొడుకుపైనే ఓ తల్లి కక్ష పెంచుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా నిలిచాడని హత్యకు ప్లాన్ చేసింది. చివరకు ఈ కుట్రలో తండ్రిని భాగస్వామిగా చేసి హతం చేసింది. ఊహించడానికే సాధ్యం కాని ఈ కృూర నేరానికి సంబంధించిన పూర్తి వివరాలు... విజయనగరం జిల్లా గుర్ల మండలం పున్నపురెడ్డిపేట గ్రామానికి చెందిన పున్నపురెడ్డి సత్యం, సీతమ్మలకు సంతానం లేకపోవడంతో సత్యం తమ్ముడి కుమారుడైన ప్రసాద్ ను పెంచుకున్నారు. కొన్నాల తర్వాత వీరికి కుమారుడు పుట్టాడు. అంతా సాఫీగా సాగుతున్న క్రమంలో పున్నపురెడ్డి సీతమ్మ మరో వ్యక్తితో అక్రమ సంబంధం నడుపుతోంది. ఈ విషయం ప్రసాద్ కంట పడటంతో తల్లిని నిలదీశాడు. ఇదేం పని అంటూ ప్రశ్నించాడు. కుమారుడి హెచ్చరికతో బుద్ధిని మార్చుకోవాల్సింది పోయి పగ పెంచుకుంది. ఎలాగైనా తన పెంపుడు కుమారుడిని హంతం చేయాలని ప్లాన్ వేసింది. తన భర్త సత్యం, అక్రమ సంబంధం పెట్టుకున్నరామారావు లను పిలిచి ప్లాన్ ను వివరించింది. ప్రసాద్ బతికి ఉంటే ఆస్థిలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తన సొంత కొడుకు రమణకు ఆస్తిలో వాట తగ్గిపోతుందని భర్త సత్యం కు వివరించింది. ఈ హత్యలో రామారావు సహకారం తీసుకోవాలని చెప్పింది. కన్న కొడుకుకు వాటా పెరుగుతుందన్న ఆశతో సత్యం తన భార్య మాటలకు తలూపాడు. హత్య చేసే రోజు సాయం చేసేందుకు మేనల్లుడైన యడ్ల రాంబాబుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. హత్య చేసిన రోజు రూ. 10వేలు, తర్వాత మరో పది వేలు, 0.35 సెంట్ల భూమిని కూడా ఇస్తామని అంగీకరించారు. హత్యకు అంతా సిద్దం కావడంతో తన ప్లాన్ లో భాగంగా ఈ కుట్ర భయట పడకుండా ఉండేందుకు ప్రసాద్ వ్యసన పరుడని చీపురుపల్లి పండగకు వెళ్లి కనబడకుండా పోయాడని సీతమ్మ, సత్యంలు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మార్చి 16న చీపురుపల్లిలో అమ్మవారి పండగను చూసొచ్చి మద్యం మత్తులో పశువులశాలలో నిద్రిస్తున్న ప్రసాద్ ను కాళ్లు చేతులు కట్టేశారు. అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేశారు. ప్రాణం పోయింది అని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని బండిపై తీసుకొచ్చి నెల్లిమర్ల మండలం వెంకన్నపాలెం గ్రామంలోని జగ్గునాయుడు చెరువులో పడేశారు. కాగా హత్య సమయంలో తన సొంత కుమారుడు జువైనెల్ అయిన పున్నపురెడ్ది రమణ అలియాస్ సంతోష్ ను కూడా హత్య జరిగిన రోజు సహాయం చేసేందుకు సీతమ్మ వాడుకుంది. మార్చి 18న జగ్గునాయుడు చెరువులో మృతదేహాం బయట పడింది. మొదట అనుమానస్పద హత్యగా కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టగా పెంచుకున్న తల్లి కిరాతకం వెలుగుచూసింది. హత్య కు పథకం వేసిన సీతమ్మ, ఆమెకు సహాయం చేసిన పున్నపురెడ్డి సత్యం, పున్నపురెడ్డి రామారావు, జువైనెల్ అయిన రమణ అలియాస్ సంతోష్, యడ్ల రాంబాబులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa