కరోనా నేపథ్యంలో ఐసిఎస్ఇ పదవ పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు సీఐఎస్సీఈ వెల్లడించింది. ఇప్పటికే 10,12వ తరగతి వార్షిక పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, 12వ తరగతి పరీక్షలను మాత్రం తర్వాత నిర్వహిస్తామని తెలిపిన సీఐఎస్సీఈ.. పదో తరగతికి సంబంధించి విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యే విషయంలో ఐచ్ఛికాన్ని ఇవ్వనున్నట్లు వివరించింది. అయితే తాజాగా దేశంలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో.. 10వ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు నేడు ప్రకటనలో పేర్కొంది. గతవారం ఉత్తర్వుల్లో పేర్కొన్న ఐచ్ఛికాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. అబ్జెక్టివ్ క్రైటీరియాలో మార్కులు కేటాయించి త్వరలోనే ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. అయితే 12వ తరగతి పరీక్షలపై మాత్రం గతంలో ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కోవిడ్ పరిస్థితిని సమీక్షించి పరీక్షల నిర్వహణకు సంబంధించి జూన్ మొదటివారంలో తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు వెల్లడించింది. కోవిడ్ దృష్ట్యా ఇప్పటికే సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa