ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కరోనా వ్యాప్తికి కారణమదేనా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 22, 2021, 04:43 PM

ఆంధ్రప్రదేశ్ లోనూ సెకండ్ వేవ్ తీవ్ర తరం కావడంతో కేసులు మరింత పెరుగుతూ.., కరోనా తన రూపం మార్చుకొని మరింత బలంగా ప్రజలపై పంజా విసురుతోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో కరోనా నిర్ధారణ అయిన వారితో పాటుగా ప్రైమరీ సెకండరీ కంటాక్స్ కు అధిక సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నా లేకున్నా పరీక్షలు చేస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా రోజుకు 2 నుంచి 3 వేలకు శాంపిల్స్ సేకరిస్తున్నారు. స్వాబ్స్ ఇచ్చిన అనుమానితులకు పరీక్షా ఫలితాల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది. అనుమానిత లక్షణాలతో స్వాబ్ ఇచ్చి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి స్విమ్స్, రుయా ల్యాబ్లో సుమారు 8 వేల నమూనాలు పెండింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల కిందట స్విమ్స్ 16 వేల స్వాబ్స్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని గుర్తించిన జిల్లా కలెక్టరు ఎం హరి నారాయణన్ త్వరగా పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు.


దీంతో రెండు రోజులుగా స్విమ్స్ స్వాబ్స్ సేకరణను నిలిపివేసి పెండింగ్లో ఉన్నవాటిని పరీక్షిస్తున్నారు. జిల్లాలోని PHC, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల నుంచి వచ్చే నమూనాలను తీసుకో లేదని సమాచారం. కేవలం స్విమ్స్ లో నిర్వహించే స్వాబ్స్ ను మాత్రమే టెస్టులో చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రికి 4 వేల నమూనాలు పెండింగ్ లో ఉన్నట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ స్పష్టం చేశారు. రుయా ఆసుపత్రి వీఆర్డీ ల్యాబ్లో సుమారు నాలుగు వేలకు పైగా కొవిడ్ నమూనాలు ఉన్నట్లు సమాచారం. జిల్లా నుంచి వందలా దిగా నమూనాలు రుయాకు వస్తున్నాయి.బుధవారం ఉదయానికి 5,800 నమూనాలు పెండింగ్లో ఉండగా మరో వెయ్యి వచ్చి నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa