ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి పీటలెక్కాల్సిన యువతి శవమైంది

national |  Suryaa Desk  | Published : Fri, Apr 23, 2021, 01:31 PM

కరోనా చేయబట్టి అనేక హృదయవిదారక ఘటనలు చూడాల్సి వస్తోంది. పెళ్లి పీటలెక్కాల్సిన ఓ వధువు కరోనా కాటుకు బలైన ఘటన గుజరాత్ లో జరిగింది. గుజరాత్ లోని మోటపోండా గ్రామానికి చెందిన మనీషా బెన్ నర్సుగా పని చేస్తోంది. ఆమె వివాహం శుక్రవారం జరగాల్సి ఉంది. ఇంట్లో అంతా పెళ్లి సందడి నెలకొంది. వచ్చిన బంధువులు పెళ్లి కూతుర్ని చేస్తూ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. బుధవారం పసుపు, పారాణి రాసే హల్దీ ఉత్సవాలనికి సిద్దం అవుతున్నారు. ఇంతలో మనీషా బెన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే ఇంజెక్షన్లు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు సూరత్ బయలుదేరారు. వారు తిరిగి రాకుండానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన అమె ఇలా శ్మశానవాటికలోకి శవంగా ప్రవేశించడం అందరిని కలిచి వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa