ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతవరణ కేంద్రాలు శుక్రవారం ప్రకటనలు విడుదల చేశాయి. మరఠ్వాడా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తా తమిళనాడు వరకు ఆవర్తనం ఏర్పడి ఉంది. సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు పేర్కొన్నాయి. రేపు, ఎల్లుండి దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa