ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ వాంబే కాలనీలో విషాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 29, 2021, 09:01 AM

విజయవాడ: విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందడం కలకలం రేపింది. వాంబే కాలనీ డీ బ్లాక్‌లో తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండటంతో స్థానికులు భర్తపై అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సమాచారం అందుకున్న నున్న గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa