ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: రామకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 18, 2021, 01:43 PM

అమరావతి: కరోనా వైద్యానికి వెచ్చించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యం కోసం రూ.2229 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని...అందులో రూ.1173 కోట్లు కేవలం మెడిసిన్స్, డ్రగ్స్ కొనుగోలుకు వెచ్చించినట్లు చెబుతున్నారన్నారు. అంత డబ్బు ఖర్చుపెట్టి ఏపీలో ఎక్కడైనా శాశ్వత వైద్య సదుపాయాలు నెలకొల్పారా అని ప్రశ్నించారు. జిల్లా స్థాయి అధికారే బెడ్ దొరకక చనిపోగా, కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉన్నాయని సాక్షి పేపర్లో రాశారన్నారు. వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేసి, ప్రజలకు నిజానిజాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రామకృష్ణ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa