ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ ఢిల్లీ పర్యటనపై రాజకీయం తగదు : మంత్రి బొత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 10, 2021, 03:07 PM

 ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై గత వారం రోజులుగా పెద్ద రాద్ధాంతమే జరుగుతున్న విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే జగన్ ఢిల్లీ చేరుకున్నారు. సీఎం వెంట ఎంపీలు మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, బాలశౌరితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. జగన్‌కు ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ స్వాగతం పలికారు. కాగా.. జగన్ ఢిల్లీ పర్యటనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.


సీఎం ఢిల్లీ పర్యటనపై రాజకీయం తగదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి నిధుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వకుండా.. విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం కంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జగన్ సర్కార్ అమలు చేస్తోందన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని బొత్స తెలిపారు. వ్యాక్సిన్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa