ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 ప్రపంచకప్‌: నమీబియాతో తలపడనున్న ఇండియా... టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియా

national |  Suryaa Desk  | Published : Mon, Nov 08, 2021, 07:39 PM

 టీ20 ప్రపంచకప్‌-2021లో టీమిండియా తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. సెమీస్‌ ఆశలు ఆవిరైన నేపథ్యంలో నామమాత్రపు పోరులో నేడు పసికూన నమీబియాతో తలపడనుంది.
భారత కాలమాన ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టీ20 సారథిగా విరాట్‌ కోహ్లికి ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో ఈ నామమాత్రపు పోరుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టీ20 సారధిగా విరాట్‌ కోహ్లికి ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా చూస్తుండగా.. కోహ్లి సేనకు కనీస పోటీనైనా ఇవ్వాలని నమీబియా భావిస్తుంది. కోహ్లి సహా రవిశాస్త్రి నేతృత్వంలోని శిక్షణా బృందానికి సైతం ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో భారత డ్రెసింగ్‌ రూమ్‌లో తీవ్ర భావోద్వేగం నెలకొంది.
తుది జట్లు:
భారత్‌: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్‌ యాదవ్‌, విరాట్ కోహ్లి(కెప్టెన్‌), రిషబ్‌ పంత్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అశ్విన్‌, రాహుల్‌ చాహర్‌, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా
నమీబియా: స్టీఫెన్‌ బార్డ్‌, క్రెయిగ్ విలియమ్స్, జేన్ గ్రీన్(వికెట్‌ కీపర్‌), గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్‌), డేవిడ్ వీస్, మైఖేల్ వాన్ లింగెన్, జెజె స్మిట్‌, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, జాన్‌ ఫ్రైలింక్‌






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa