ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకినాడ నగరపాలక సంస్ధ పోలింగ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 30, 2017, 10:34 AM

అమరావతి : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణలతో కలిసి సమీక్షించారు. మంగళవారం ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు మంత్రులు, కాకినాడ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు నేతలతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నారు. మొత్తం 196 పోలింగ్‌ కేంద్రాల్లో పోల్‌అవుతున్న ఓట్ల వివరాలను నేతల ద్వారా తెలుసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు సచివాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌లో పోలింగ్‌ జరుగుతున్న తీరును పరిశీలిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారం అందించారు. ఆరంభంలో పోలింగ్‌ ప్రక్రియ కొంత మందకొడిగా సాగిన చివరకు వేగం పుంజుకుని 71శాతానికి చేరడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa