ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ ఏజెన్సీ లో చిన్నారుల కిడ్నాప్ ముఠా అరెస్ట్.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 09, 2021, 01:56 PM

విశాఖ ఏజెన్సీ లో చిన్నారుల కిడ్నాప్ ముఠా సభ్యులను పోలీసు లు అరెస్ట్ చేసారు. విశాఖలోని విక్టోరియా ఆస్పత్రి లో సెక్యూరిటీ గార్డులు గా పనిచేస్తున్న ఇద్దరు సూత్రధారులుగా గుర్తించారు. ముఠాకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు కిడ్నాపర్ల నుంచి నలుగురు చిన్నారులను కాపాడారు. ఈ మేరకు అరకు లో జరిగిన ఓ ఘటన ఆధారంగా విచారణ చేపట్టగా ఈ నిందితుల చిట్టా బయటపడింది. పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు నలుగురు చిన్నారులను కాపాడారు.


విశాఖ ఏజెన్సీ అరకులో ఉపాధికోసం వచ్చిన ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ దంపతుల ఆరు నెలల బాబు కిడ్నాప్ గురయ్యాడు. ఈ నెల మూడో తేదీన ఈ ఘటనపై అరకు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టగా కీలక నిజాలు బయటపడ్డాయి. విశాఖలోని విక్టోరియా ఆస్పత్రి లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న నీలా పు రమణి. ఆమె స్నేహితుడు పొలమరశెట్టి రమేష్ ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు తేలింది. వీరిద్దరూ మరో ఎనిమిది మందితో కలిసి ఆరుబయట ఆడుకుంటున్న పిల్లల్ని ఎత్తుకుపోయి ఇతరులకు అమ్మకాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వారివద్ద నుంచి నాలుగు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa