ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 12, 2021, 10:20 AM

హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ రోడ్ మార్గాన మంగళగిరి లోని పార్టీ కార్యాలయంకి పవన్ కళ్యాణ్ బయలుదేరారు.


విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావ దీక్ష చేపట్టనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నారు.


వేదికపై పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు, రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. అభిమానులు, కార్యకర్తలు సందర్శించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ జేఏసీ నాయకులు పవన్ దీక్షకు మద్దతు తెలపనున్నారు. సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమించిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa