ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూడూరు యువకుడు రాపూరు అటవీ ప్రాంతంలో అదృశ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 13, 2021, 10:30 AM

రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్ లో సుమారు 10 కిలోమీటర్ల  సమీపంలో ఉన్న సిద్దలయ్యకోన జలపాతం తిలకించేందుకు గూడూరు  చౌట పాలెం కు చెందిన 5 మంది యువకులు ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జలపాతం వద్దకు చేరుకొని జలపాతం లో కొద్దిసేపు  జలకాలాడారు.అసలే అటవీ ప్రాంతం చీకటి  కావటంతో 5 మంది స్నేహితులు తిరుగు ప్రయాణమయ్యారు. జలపాతం నుండి కొంత దూరం వచ్చిన తర్వాత వెనుకబడిన కిషోర్ కనిపించకపోవడంతో మిగిలిన నలుగురు స్నేహితులు ఆ ప్రాంతమంతా గాలించారు.కిషోర్ జాడ కనిపించక పోవడంతో రాపూరు పోలీసులకు రాత్రి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫారెస్ట్ అధికారులతో కలిసి కిషోర్ ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa