ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డివైడర్ మార్పు లేకుంటే కష్టమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 13, 2021, 10:28 AM

మంగళగిరి పట్టణం లో గౌతమబద్ద రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత రోడ్డు మధ్యలో డివైడర్ ను నిర్మించి అనంతరం రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు చేశారు. అయితే డివైడర్ కు మధ్యలో ఎటువంటి టర్నింగ్ పోయింట్ లు లేకుండా ఏకమొత్తంగా ఆర్ అండ్ బీ బంగ్లా నుండి బస్ స్టాండ్ వరకు అక్కడి నుండి పాత బస్టాండ్ వద్ద మాత్రమే రోడ్డు దాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే గతంలో రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం పాత పెట్రోల్ బంక్ వద్ద డివైడర్ కు మధ్యలో వాహనాలు తిరిగేందుకు అవకాశం కల్పించారు.కాగా పాత డివైడర్ ను తొలగించి నూతనంగా నిర్మిస్తున్న డివైడర్ కు మధ్యలో ఎటువంటి టర్నింగ్ పాయింట్ లు ఏర్పాటు చేయకుండా నిర్మాణం చేయడంతో పలువురు వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.డివైడర్ నిర్మించి మధ్యలో వాహనాలు రోడ్డు దాటేందుకు లేకపోవడం వలన సుమారు ఒక కిలోమీటర్ దూరం తిరిగి రావాల్సి ఉంటుంది. దీనివలన వాహన దారులు రోడ్డుకు ఎదురుగా రావడం వలన ట్రాఫిక్ కు అంతరాయం తో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.అలానే పార్క్ రోడ్డు, కొత్తపేట, కోనేరు వీధి వంటి పలు ప్రాంతాల్లో పాదచారులు రోడ్డు దాటేందుకు మార్గం ఉండేది. గతంలో మాదిరిగా వాహనాలు రోడ్డు దాటేందుకు, పాదచారులు రోడ్డు దాటేందుకు ఉన్న ప్రాంతాల్లో తిరిగి నూతన డివైడర్ కు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిర్మించిన తరువాత పగలకొట్టి ప్రజాధనం వృధా చేసే కంటే ముందే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa