ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 5784 కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 14, 2021, 12:13 PM

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 41కి చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధికంగా 20 మందిలో ఈ రకాన్ని గుర్తించగా రాజస్థాన్‌09, గుజరాత్04, కర్ణాటక03, ఢిల్లీ02, కేరళ01, ఏపీ01, చండీగఢ్‌01లో ఈ వేరియంట్ బాధితులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,784 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. నిన్న మరో 252 మంది మృత్యువాత పడ్డారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa