కృష్ణా: ఇచ్చిన మాట ప్రకారం జనవరి ఒకటో తేదీ నుంచి పింఛన్లను రూ. 2500కు పెంచుతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలుసు పార్ధసారధి బుధవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ నెలా ఠంఛన్ గా ఒకటో తేదీ తెల్లవారుజామున ఇంటి తలుపుతట్టి అవ్వాతాత, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ మాత్రమేనన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పింఛన్లను సక్రమంగా అందిం చకపోగా తీవ్ర అవస్థలకు గురి చేశారని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతనంగా పింఛన్లు మంజూరు చేయటంతో పాటు వారి ఇంటి వద్దనే పింఛన్లు అందజేస్తున్నారన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి అవ్వాతాత, వితంతువుల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa