ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో సహజీవనం.. క్షణికావేశంలో దారుణం

national |  Suryaa Desk  | Published : Thu, Dec 16, 2021, 12:47 PM

పెళ్లైన 2 నెలలకే భర్తను వదిలేసిన ఓ యువతి తన ప్రియుడితో సహజీవనం చేసింది. తన ప్రియుడితో గొడవ పడి క్షణికావేశంలో అతడిని చంపేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూనమ్ అనే యువతికి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లైన రెండు నెలలకే ఆమె భర్తను వదిలేసి కరణ్ సింగ్ అనే యువకుడితో సహ జీవనం చేస్తోంది. కొన్నేళ్ల నుంచి వాళ్లు భార్యాభర్తల్లా కలిసి ఉంటున్నారు. జూన్ 25న పూనమ్, కరణ్ మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో పూనమ్ చేతికి దొరికిన ఓ వస్తువుతో కరణ్ తలపై కొట్టింది. కరణ్ ప్రాణాలు కోల్పోయాడు. పూనమ్ అక్కడి నుంచి పారిపోయింది. పోలీసులు ఈ హత్య కేసులో పూనమ్ కోసం 5 నెలలుగా వెతుకుతున్నారు. ఎట్టకేలకు ఆమె ఆచూకీని కనిపెట్టారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, హత్య చేసే ఉద్దేశంతో దాడి చేయలేదని పూనమ్ విచారణలో చెప్పింది. అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఇన్నాళ్లు తప్పించుకుని పోయినట్లు తెలిపింది. పోలీసులు ఆమెను జైలుకు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa