ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులు రూ.6 వేలు పొందండిలా

national |  Suryaa Desk  | Published : Thu, Dec 16, 2021, 12:58 PM

పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు రూ.6000 సాయాన్ని కేంద్రం అందిస్తోంది. ఏడాదికి మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రైతుల అకౌంట్లలోకి డబ్బును జమ చేస్తోంది. భూ యజమానులందరికీ ఈ పథకం అందుతుంది. పీఎం కిసాన్ పథకానికి ఇలా అప్లై చేయవచ్చు. ముందుగా https://pmkisan.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. Farmers corner సెక్షన్‌లో New Farmer Registration పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్, ఇమేజ్ టెక్స్ట్ ఎంటర్ చేయాలి.ఆ తర్వాత వివరాలన్నీ ఎంటర్ చేసి దరఖాస్తు చేయాలి.దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ వస్తుంది.ఆ రిఫరెన్స్ నెంబర్‌తో అప్లికేషన్ ట్రాక్ చేయొచ్చు. పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేయడంలో ఏవైనా సమస్యలు వస్తే హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. 155261 లేదా 1800115526 లేదా 011-23381092 నెంబర్లకు రైతులు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa