ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలులో వైభవంగా గణేశ్‌ శోభాయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 02, 2017, 04:51 PM

కర్నూలు: కర్నూలు నగరంలో గణేశ్‌ శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. నగరంలోని కేసీ కెనాల్‌ వద్ద ఏర్పాటుచేసిన వినాయక్‌ ఘాట్‌కు బొజ్జ గణపయ్యలు తరలివెళ్తన్నారు. వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య నగరంలోని 4 ప్రాంతాల నుంచి గణేశుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ శోభాయాత్ర ఇంకా కొనసాగుతోంది. తొలుత కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన గణేశుడిని వినాయక ఘాట్‌లో నిమజ్జనం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా జరుగుతోంది. కేసీ కెనాల్‌ వద్ద మొత్తం 6 చోట్ల భారీ క్రేన్లను ఏర్పాటుచేశారు. 11 ఘాట్‌లలో పెద్ద పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. నీటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే సుంకేసుల జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ఘాట్‌లో మొత్తం 1800 విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జన వేడుకలు ఈ మధ్యాహ్నం 3.30 గంటలకే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. ఈ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు కలెక్టర్‌ కూడా ఇప్పటికే ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు మూడుసార్లు బక్రీద్‌, వినాయక నిమజ్జనం ఒకేసారి వచ్చినప్పటికీ కర్నూలు నగర ప్రజలు హిందూ, ముస్లిం భాయీ భాయీ అంటూ శాంతి, సామరస్యతకు చిహ్నంగా నిలుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa