ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లైన 19 రోజులకే నవ వధువు అనుమానాస్పద మృతి

national |  Suryaa Desk  | Published : Fri, Dec 24, 2021, 12:45 PM

కర్ణాటకలోని హసన్ లో విషాదం జరిగింది. పెళ్లైన 19 రోజులకే నవ వధువు అనుమానాస్పద స్థితిలో మరణించింది. హసన్ జిల్లా అరకలగుడు తాలూకా హోలలగుడు గ్రామానికి చెందిన ఫిజా ఖానుమ్ కు 22 సంవత్సరాలు. డిసెంబర్ 2న షాజిల్ మహ్మద్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యభర్తలు టూర్ కు కూడా వెళ్లారు. ఏమైందో ఏమో కానీ డిసెంబర్ 21న ఫిజా ఖానుమ్ అనుమానాస్పదంగా అత్తవారింట్లో మరణించింది. అదనపు కట్నం కోసమే తమ కూతురు స్నానానికి వెళ్లిన సమయంలో గ్యాస్ గీజర్ ఆన్ చేసి డోర్ క్లోజ్ చేశారని, పక్కా ప్లాన్‌తో చంపారని వివాహిత తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa