ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాన్యుడికి గుదిబండగా మారిన ఇంటి నిర్మాణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 24, 2021, 12:54 PM

ఇప్పుడు సొంత ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కల, తమ హోదాకు తగ్గట్టుగా సొంత ఇల్లు నిర్మించుకొని తనకంటూ ఒక సొంత ఇల్లు ఉందని ఎంతో గర్వ పడుతుంటారు. మంచి ఇల్లు కట్టుకోవాలని తమ దగ్గర ఉన్న డబ్బు వెచ్చించి అది సరిపోకపోతే అప్పు చేసి మరీ ఇంటిని నిర్మించుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే సామాన్యుడు ఇల్లు కట్టుకునేందుకు పెరిగిన ధరలతో సొంత ఇల్లు నిర్మాణం గుదిబండగా మారింది. రానున్న రోజుల్లో సొంత ఇంటి నిర్మాణం చేసుకునే పరిస్థితి లేదేమో అని ప్రతి ఒక సామాన్యుడు లోలోన ఆందోళన చెందుతున్నాడు.


ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించే ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడు కుదేలు అవుతున్నాడు. ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకునేందుకు పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే లక్ష నుంచి మూడు లక్షల లోపే మంచి ఇంటి పూర్తి అయ్యేది. ప్రస్తుతం ఆ అంచనా 10 లక్షల వరకు పెరిగింది. ఇక అంతేనా కొంచెం లగ్జరీగా కట్టుకోవాలంటే 20,30,50, లక్షలే కాదు కోటి రూపాయలు కూడా సరిపోవడం లేదు.


ప్రస్తుతం ప్రభుత్వ ఇసుక ధర టన్ను 1,200 నుంచి 1,400రూపాయల వరకు పలుకుతుంటే బ్లాక్ లో అయితే టన్ను ఇసుక ధర రెండు వేల రూపాయలకు పైగానే ఉంది. ఐరన్ కేజీ రూ.100 పైగా ఉంది. ఇక సిమెంటు బస్తా రూ.4,00 వరకు పలుకుతుండగా, 2,000 మంచి రకం ఇటుక 18 వేల రూపాయల ధర ఉంది. ఇక కూలీల విషయానికి వస్తే గ్రామాలు, ఓ మోస్తరు పట్టణాలలో మేస్త్రి 7,00 నుంచి 8,00 వందల రూపాయలు తీసుకుంటూ ఉండగా,మేస్త్రి కి సహాయంగా ఉండే కూలీకి 4,00 వందల నుంచి 500 రూపాయల వరకు గృహ నిర్మాణ దారుడు చెల్లించుకోవాల్సి పరిస్థితి తలెత్తింది. ఇక ఇంటికి ఉపయోగించే పెయింట్ ఎలక్ట్రికల్ పరికరాల ధరల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి కూడా విపరీతంగా ధరలు పెరిగాయని ప్రతి ఒక్కరూ ఒప్పుకోక తప్పదు.


10 సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణ ముడిసరుకుల ధరలు ప్రస్తుతమున్న ధరలలో సగం కూడా ఉండేవి కాదు. మరి రానున్న రోజుల్లో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే సాధ్యమయ్యేనా, పెరిగిన ధరలతో కుదేలవుతున్న సామాన్యుడి పరిస్థితి ఏంటి..?ప్రభుత్వాలు సామాన్యుడు ఇల్లు నిర్మించుకునేందుకు ముడిసరుకుల ధరలు అందుబాటులోకి తెచ్చానా..? సొంత ఇంటి నిర్మాణం గుదిబండగా మారిన సామాన్యుడికి ఉపశమనం కలగాలని ప్రతి ఒక్కరం ఆశిద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa