ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుప్పకూలిన ఐఏఎఫ్ చెందిన మిగ్-21 యుద్ధ విమానం

national |  Suryaa Desk  | Published : Sat, Dec 25, 2021, 12:41 PM

భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మిగ్-21 యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. శుక్రవారం రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ ఘటనలో వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా ప్రాణాలు కొల్పోయాడు. బార్మర్ లో శిక్షణ సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. వైమానిక దళానికి చెందిన విమానాల ప్రమాదాలు కొత్తేమీ కాకపోయినా తాజా ఘటన పాక్ బార్డర్ సమీపంలో చోటు చేసుకోవడంతో అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa