ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చోరీకి యత్నించి విద్యుదాఘాతానికి గురైన దొంగ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 25, 2021, 02:20 PM

గుంటూరు: చోరీకి యత్నించి విద్యుదాఘాతానికి గురైన వెంకటనారాయణ. తనపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని నాటకమాడాడని రూరల్‌ నేరవిభాగ ఏఎస్పీ ఎన్‌వీఎస్‌ మూర్తి తెలిపారు. శుక్రవారం గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 20వ తేదీ రాత్రి పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన వెంకటనారాయణ. బోయపాలెం వద్ద పొలాల్లో తీవ్ర గాయాలతో పడివున్నాడనే సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారన్నారు. ఘటనా స్థలంలో బూట్లు, కట్టర్‌, రేంచీలు, బ్లేడ్‌ గుర్తించినట్లు తెలిపారు. బూట్లు వాసన చూసిన జాగిలాలు బాధితుడు పడి ఉన్న ప్రాంతంలో ఆగాయన్నారు. వెంకటనారాయణ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు చేసే ముద్దాయిగా దర్యాప్తులో తేలిందన్నారు. ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని తెలిపారు. బోయపాలెం వద్ద స్పిన్నింగ్‌ మిల్లులోని ట్రాన్స్‌ఫార్మర్‌ పగలగొట్టి చోరీకి యత్నించిన క్రమంలో విద్యుదాఘాతానికి గురై శరీరంపై కాలిన గాయాలు, కిందపడటంతో తలకు గాయమైనట్లు తేలిందన్నారు. అతనిపై ఎవరూ దాడి చేయలేదని దర్యాప్తులో తేలిందని. ఎటువంటి రాజకీయ కోణం లేదన్నారు. వెంకటనారాయణ చికిత్స పొందుతున్నాడని. తప్పుదోవ పట్టించినందుకు కేసు నమోదు చేశామన్నారు. సమావేశంలో చిలకలూరిపేట రూరల్‌ సీఐ సుబ్బారావు, ఎస్సై రాజేష్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa