రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. మంగళవారంనాడు విజయవాడలో జరిగే ప్రజాగ్రహ సభ ఏర్పాట్లును ఆయన పార్టీ నేతలతో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం ప్రజలను అనేక హామీలిచ్చి నమ్మించింది. ఒక్క అవకాశమిస్తే ఆకాశం భూమ్మీద పెడతామని చెప్పి వ్యవస్ధలను కక్షతో నాశనం చేస్తోంది. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ వ్యాపారాలు చేసుకుంటోంది. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాగ్రహసభలో ఎండగడతాం. వైసీపీ అధికారంలోకొచ్చాక ఒక్క వ్యవస్థైనా బాగుందా, ఆర్ధిక వ్యవస్థను జగన్ చిన్నాభిన్నం చేశారు. ఓట్లు కొనుగోలు చేయడం తప్ప ప్రజలకు ఒరిగేదేం లేదు.సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెబుతూ.. అన్ని రేట్లు పెంచేశారు. జగన్ అవగాహన రాహిత్యం.. అసమర్థత వల్ల భగవంతుడు కూడా రక్షించి లేని రాక్షస పాలన సాగుతోంది. అని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa