ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్ పీఠం,,,ఆప్ కే ,,,సీ ఓటర్ సర్వే

national |  Suryaa Desk  | Published : Tue, Dec 28, 2021, 12:03 AM

దేశ రాజకీయాలలో చాపకింద నీరులా  చిన్నగా విస్తరిస్తున్న ఆప్ పార్టీ త్వరలో పంజాబ్ రాష్ట్రంలోనూ జెండా ఎగరవేయనున్నది.  ఢిల్లీలో  రెండు పర్యాయాలు విజయం సాధించిన ఆ పార్టీ ఇపుడు  పంజాబ్ రాష్ట్రంపై ప్రత్యేక నజర్ సారించింది. దీంతో ఆ రాష్ట్రంలోనూ అధికారం దిశగా ఆప్  అడుగులు వేస్తోందని సీ ఓటర్ సర్వే  తేల్చింది. పంజాబ్ పోరులో గెలిచేదేవరు. ఇదే అంశంపై పలు మీడియా సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అయితే మెజార్టీ మాత్రం కాంగ్రెస్ లేదంటే.. ఆప్‌కు అనుకూలంగా ఉన్నాయి. తాజాగా సీ ఓటర్ కూడా ఓటర్ల మనోగతాన్ని తెలియజేసింది. అయితే సర్వే మాత్రం ఆప్ విజయం దక్కించుకుంటుందని లెక్కగట్టింది. రాష్ట్రంలో అధికారం మార్పు జరుగుతుందని పేర్కొంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అకాలీదళ్, బీజేపీ, ఇటీవల ఏర్పాటు చేసిన మాజీ సిఎం అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ సీ ఓటర్ మాత్రం ఆప్‌కు 32 శాతం మంది ఓట్లు వేస్తారని.. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలుస్తోందని తెలిపింది. అధికార పార్టీ 27 శాతం ఓట్లతో వెనుకపడుతుందని వివరించింది. అధికారం తథ్యం అని ధీమాతో ఉన్న అకాలీదల్ 11 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. హంగ్ ఏర్పడే అవకాశం ఉందని 6 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇతరులకు 3 శాతం.. ఇప్పుడే చెప్పలేం అని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు. రేవంత్ మైండ్ సెట్ మార్చండి,లేదా పీసిసి పదవి నుంచి తప్పించండి.!సోనియాకు జగ్గారెడ్డి లేఖాస్త్రం.! పంజాబ్ ప్రభుత్వం మారాలని అనుకుంటున్నారా? అని వారిని అడిగితే.. మారాలని అనుకుంటున్నాం- 66 శాతం తమ అభిప్రాయం చెప్పారు. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తెలిసింది. ప్రభుత్వం మారకూడదని కేవలం 34 శాతం మంది మాత్రం అనుకున్నారు. అంటే సీ ఓటర్ సర్వే ప్రకారం పంజాబ్‌ను ఆప్ గెలుచుకోబోతుంది. ఇదివరకు కూడా ఆప్ మెజార్టీ స్థానాలు సాధిస్తుందని లెక్కలు గట్టారు. సీఎం అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ వైపు ఓటర్లు ఇంట్రెస్ట్ చూపించారు. Ads by Ads by ఇటు రైతు సంఘం కూడా పంజాబ్ ఎన్నికల బరిలోకి దిగుతుంది. పంజాబ్‌లో 32 రైతు సంఘాలు ఉండగా.. 22 సంఘాలు ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. ఈ సంస్థలు పంజాబ్ సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో పార్టీని కూడా ప్రకటించాయి. రైతుల పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 117 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. బల్బీర్ సింగ్ రాజేవాల్ రైతుల ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa