ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు రైతు బజార్ లో ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 02:28 PM

కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ ఏమీ కొనలేని తినలేని పరిస్థితి నెలకొందంటూ సామాన్యం జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండు వందల రూపాయలకు సంచి నిండా కూరగాయలు వచ్చేవని. ఇప్పుడు వెయ్యి ఖర్చు చేస్తున్నా నిండటం లేదంటున్నారు. కర్నూలు సీ.క్యాంప్ రైతు బజార్ లో  టమోటా ప్రస్తుతం 50 రూపాయలకు చేరింది. వంకాయలు, బెండకాయలు, బీన్స్, కాకర, బీర, పచ్చిమిర్చి ధరలు అన్ని 60 నుంచి 80 రూపాయలకు చేరుకొన్నాయి. ధరలను అదుపు చెయ్యడంలో అధికారులు తగిన చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్లే  ధరలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa