ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్ధరాత్రి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం

national |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 10:06 AM

తమిళనాడు రాజధాని చెన్నై నగరం వర్షాలతో అతలాకుతలమైంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపై నీరు నదిలా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ అర్ధరాత్రి చెన్నైలో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు అధికారులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలని సూచించారు. అనంతరం కంట్రోల్ రూంలో అధికారులతో మాట్లాడి నగరంలోని పలు ప్రాంతాలను తెరపై పరిశీలించారు. నీట మునిగిన ప్రాంతాల్లో అధికారులతో ఫోన్ లో మాట్లాడి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అర్ధరాత్రి లోతట్టు ప్రాంతాలకు సీఎం రాగానే అక్కడి ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. వర్షం పడిన ప్రతిసారీ నీటిలోనే ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం కురిసిన వర్షాలకు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డామని తమ కాలనీ వాసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa