ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారిపై చర్యలు తప్పవు: కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 09, 2022, 11:01 AM

విజయనగరం: యుద్ధప్రాతిపదికన ఉపాధి కన్వర్జెన్సీ పనులు పూర్తి చేయాలని, అందుబాటులో ఉన్న  నిధులు మార్చి నెలాఖరునాటికి ఖర్చు చేయాలని జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు సూచించారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఉపాధి హామీ కన్వర్జెన్సీ నిధుల వినియెగంపై శనివారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ. కొవిడ్‌ కారణంగా గతంలో నిధులు వృథా అయ్యాయని, ఈ సారి అలా జరగకుండా చూడాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులను సంప్రదించి మార్చిలోగా సచివాలయ, ఆర్బీకే, వెల్నెస్‌ సెంటర్‌ భవన నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఇసుక, సిమెంట్‌ ఇబ్బంది రాకుండా చూస్తామని తెలిపారు. గ్రామా పంచాయతీల్లో నామినేటెడ్‌ పనులకు  ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సిమెంట్‌ సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకోవాని అధికారులకు సూచించారు.  


అంతకముందు డ్వామా పీడీ ఉమా పరమేశ్వరి మాట్లా డుతూ.  ఉపాధి వేతనదారులకు ఈ ఏడాది 2. 68 కోట్ల పనిదినాలు కల్పించాలన్నది లక్ష్యం కాగా  దాన్ని అధిగమించి 111 శాతం పనిదినాలు కల్పించినట్లు తెలిపారు. కన్వర్జెన్సీ పనులకు సంబంధించి జిల్లాలో ఈ ఏడాది రూ. 440 కోట్ల వరకూ నిధులు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు రూ. 78 కోట్ల విలువైన పనులు మాత్రమే నిర్వహించినట్లు చెప్పారు. మార్చిలోగా మరో రూ. 360 కోట్లను ఖర్చు చేయాల్సి ఉందన్నారు.  


కలెక్టర్‌ సూర్యకుమారి మాట్లాడుతూ.   ప్రతి గ్రామంలో కన్వర్జెన్సీ నిధులతో చేపట్టాల్సిన పనులు గుర్తించి మార్చిలోగా  పూర్తి చేయాలన్నారు. ఒక్క రూపాయి  వెనక్కి వెళ్లినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, అటువంటి వారిపై  చర్యలు తప్పవని  స్పష్టంచేశారు. నిధులు వినియోగానికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యల నివృత్తి చేసేందుకు జిల్లా స్థాయిలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు  చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు.   జగనన్న కాలనీల్లో త్వరగా రహదారులు వేయాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ  సీఈవో  వెంకటేశ్వర రావు, పీఆర్‌ ఎస్‌ఈ గుప్తా, ఆర్‌డబ్ల్యూఎస్‌  ఎస్‌ఈ  శివానందకుమార్‌,   ఎంపీడీవోలు, పీఆర్‌ ఇంజినీర్లు, డ్వామా ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa