ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 38,479 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 1,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా చిత్తూరు జిల్లాలో 254 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి . విశాఖ జిల్లాలో 196 కరోనా కేసులు నమోదయ్యాయి,అనంతపురం జిల్లాలో 138 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి, కృష్ణా జిల్లాలో 117 కరోనా కేసులు రాగా, గుంటూరు జిల్లాలో 104 కరోనా కేసులు వచ్చాయి, నెల్లూరు జిల్లాలో 103 కేసులు వెల్లడయ్యాయి.అదే సమయంలో 140 మంది కరోనా నుంచి కోలుకున్నారు, ఇద్దరు మృతి చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa