పీఆర్సీ రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు గురువారం చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ నేపథ్యంలో గుంటూరు వైపు నుండి విజయవాడకు చేరుకునే అన్ని మార్గాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి లోని ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గమ్మ వారధి వద్ద పోలీసులు తనిఖీల నేపథ్యంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సాధారణ పనులు నిమిత్తం, ఉద్యోగాలకు వెళ్లాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa