జగనన్న చేదోడు పథకం రెండో ఏడాది నిధుల విడుదల సందర్భంగా ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ 'ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరు. చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ ఉన్నవారికి ఆందోళనలు కావాలి. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కి ఆందోళనలు కావాలి. ఆశా వర్కర్లను కొందరు రెచ్చగొడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేశాం. ఆర్టీసీ విలీనంతో ఏటా ప్రభుత్వంపై రూ.3600 కోట్ల భారం పడింది. అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే కోర్టుకెళ్లారు. పేదలకు ఇళ్లు రాకుండా అడ్డుకున్న చంద్రబాబుకు కామ్రేడ్లు మద్ధతు ఇస్తున్నారు. ఎర్రజెండా వెనుక పచ్చజెండా అజెండా' అని సీఎం జగన్ అన్నారు.
ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో లక్షా 20 వేల శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 92 శాతం కార్పొరేషన్ ఛైర్మన్ పదవులిచ్చాం. మున్సిపల్ ఛైర్మన్ పదవులను 73 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చామని సీఎం జగన్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa