ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నబస్సుకు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 01, 2017, 11:18 AM

సూర్యపేట జిల్లాలోని మునగాల మండలం మొద్దుల చెరువు గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న అవనిగడ్డ డీపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపిన డ్రైవర్ లారీ కిందకు దూరి టైరు విప్పుతున్నాడు. దానిని దాటి వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. ఒక పక్క బస్సు బాగం మొత్తం లారీని చీల్చుకుంటూ వెళ్లింది. ఉదయం మూడు గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు సూర్యపేట, కోదాడ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. లారీ కింద చిక్కుకున్న లారీ డ్రైవర్ ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడు. బస్సు ప్రయాణికుల్లో ఒక మృతుడు మాతంగి వరప్రసాద్(60)గా గుర్తించారు. మిగితా మృతుల వివరాలను పోలీసులు తెలుసుకునేందుక ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిలో కృష్ణాజిల్లా కోసూరుకు చెందిన మునగాల రమాదేవి, పెద్దకూడి సుబ్బారావు, ఖమ్మం జిల్లా తల్లడ మండలానికి చెందిన రాణి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa