న్యూఢిల్లీ : కేరళలో లవ్ జిహదీ కొనసాగుతున్నట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. లవ్ జిహాద్ ఓ ప్రమాదకర పరిణామంగా మారిందన్నారు. ఫైర్బ్రాండ్ హిందూత్వ లీడర్ ఇవాళ కేరళలోని కన్నూర్లో పర్యటించారు. అక్కడ ఆయన ర్యాలీ కూడా నిర్వహించారు. లవ్ జిహాద్ అంశంపై సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసిందని, ఎన్ఐఏ కూడా ఆ అంశాన్ని విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు. లవ్ జిహాదీ కేసుల పట్ల కేరళ ప్రభుత్వం దృష్టి పెట్టాలని యూపీ సీఎం యోగి ఈ సందర్భంగా కోరారు. కేరళలో బీజేపీ కార్యకర్తల హత్యలను కూడా ఆయన ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ మర్డర్లకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు కేరళలో పర్యటిస్తున్నారు. మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా కేరళలో టూర్ చేశారు. జన్ రక్షా యాత్రలో పాల్గొన్న యోగీ ఆదిత్యనాథ్.. కేరళ ప్రభుత్వం హత్యలను ఆపాలని డిమాండ్ చేశారు. అయితే సమర్థవంతంగా హాస్పటల్లను ఎలా నిర్వహించాలన్న అంశాన్ని యోగి ప్రభుత్వం నేర్చుకోవాలని సీపీఎం పార్టీ తన ట్వీట్లో యూపీ సీఎంపై విమర్శలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa