విశాఖ ఏజెన్సీలో ఆదివాసి రైతులు పండించిన మిరియాల పంట కు ఈ ఏడాది గరిష్ట ధర లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో మిరియాల పంటకు భారీ డిమాండ్ పెరిగింది. దీంతో మిరియాలు ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం పాడేరు, చింతపల్లి, అరకు డివిజన్ల పరిధిలో కిలో మిరియాలను రూ. 400 ధరకు వర్తకులు కొనుగోలు చేస్తున్నారు. శనివారం గూడెంకొత్తవీధి మండలం సప్పర్ల వారపు సంతలో ప్రైవేటు వర్తకులు కిలో మిరియాలను రూ. 400 ధరకు పోటీపడి కొనుగోలు చేశారు. ఇది ఇలా ఉండగా గిరిజన రైతులు పక్వ దశకు వచ్చిన మిరియాల గింజలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. గత నాలుగేళ్లలో మిర్యాల పంటకు గరిష్ట ధర లభించడం ఇదే ప్రథమమని రైతులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa