ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాపట్ల సూర్యలంక రహదారిపై ఐస్ గుట్టలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 11:15 AM

బాపట్ల సూర్యలంక రహదారిపై చేపల వ్యాపారులు ఐస్ గుట్టలు పడవేసి వెళుతున్నారు. దీనివల్ల వాహన దారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని సార్లు చెప్పినా వీరి తీరు మారడం లేదని వాహనదారులు తెలిపారు. రోడ్డుపై అడ్డంగా ఐస్ గుట్టలు, చేపల దిబ్బలు ఎండబెట్టడం వలన వాహన రాకపోకలకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి తోడు విపరీతమైన దుర్వాసన. రాకపోకలు అంతరాయంతో తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్న పర్యాటకులు, వాహనదారులు, పాదాచారులు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న సూర్యలంక బీచ్ కి మచ్చ తెచ్చేలా అక్కడ సముద్ర చేపల వ్యాపారులు వ్యహరించటం గర్హనీయం. బాపట్ల కేంద్రంగా జిల్లా అవుతున్న తరుణంలో బాపట్లని ఎలాగైనా అభివృద్ధి పధంలోకి నడిపించాలని, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలను, పర్యాటకులను బాపట్ల వైపు నడిపించాలని స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తీవ్రంగా కృషి చేస్తుంటే. ఇక్కడ స్థానిక చేపల వ్యాపారులు మాత్రం వచ్చే కొద్దోగొప్పో పర్యాటకులను కూడా రాకుండా తమ వ్యవహార శైలితో ఆపి వేస్తున్నారు. ఇదిలా ఉండగా రోడ్డుపై అడ్డంగా చేపల గుట్టలను, ఐస్ గుట్టలను పోసి ప్రజలకు వాహనదారు లకు, పర్యాటకులకు ఈ విధంగా ఇబ్బందులకు గురిచేయడం గతంలో లేదు అని వైసీపీ అధికారంలోకి వచ్చాకనే ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి, అధికారులు స్పదించి ప్రజలకు, పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa