కోటప్పకొండ తిరునాళ్లకు ఆర్టీసీ నరసరావుపేట డిపో నుంచి 264 సర్వీసులు నడిపింది. రూ. 63. 83 లక్షలు ఆర్టీసీకి ఆదాయం లభించింది. సుమారు 2. 47 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్టు డీఎం వీరాస్వామి తెలిపారు. కొండ దిగువ నుంచి కొండ పైకి ఆర్టీసీ ఉచితంగా వీఐపీలకు బస్సులను ఏర్పాటు చేసింది. 20 సర్వీసులు వీఐపీల కోసం నడిపింది. సుపర్ లగ్జరీ బస్సులను వీరికి ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ జారీ చేసిన వీఐపీ పాస్లతో కొండ పైకి 20 వేల మంది వీఐపీలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లారు. అదే సంఖ్యలో కొండ కిందకు కూడా ఉచితంగా తిరుగు ప్రయాణం చేశారు. సెమీ లగ్జరీకి ఒక్కొక్కరికి ఆర్టీసీ కొండపైకి రూ. 30 టిక్కెట్ వసూలు చేస్తుంది. దాదాపు 20 సర్వీసులు నిర్వహించగా 1, 028 ట్రిప్పులు నడిపినట్టు డీఎం వీరాస్వామి చెప్పారు. వీఐపీల ఉచిత ప్రయాణం ద్వారా ఆర్టీసీకి దాదాపు 12 లక్షలు గండిపడింది. అలాగే ట్రాఫిక్ జామ్ వలన సుమారు మూడు గంటలపాటు బస్సులు నడపలేకపోవటం వలన కూడా మరో రూ. 10 లక్షల వరకు ఆదాయానికి గండిపడి ఉండవచ్చని అంచనా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa