ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీఐఐసి ఎండీ చిత్రంతో అక్రమాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 09:05 AM

గుంటూరు జిల్లా మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మంగళగిరి ఆటో నగర్ లోని ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ( ఎండీ ) జేవీఎస్ సుబ్రహ్మణ్యం ఫొటోతో గుర్తు తెలియని వ్యక్తి అక్రమాలకు పాల్పడుతున్నట్లు సంస్థ సీజీఎం జ్యోతిబసు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎండీ ఫొటోను తన వాట్సప్ డీపీగా ఉంచిన ఆ వ్యక్తి సదరు అధికారి పంపినట్లుగా ఉద్యోగులకు సంక్షిప్త సందేశం పంపుతున్నట్లు పోలీసులు చెప్పారు. అగంతుకుడి ఆచూకీ తెలుసుకుని చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో కోరారని పోలీసులు వెల్లడించారు. త్వరలోనే నిందితుడిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa