ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ చేరుకున్న ఘంటసాల విద్యార్థి రాకేష్ కుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 01:29 PM

ఉక్రెయిన్ రాజధాని క్వీన్స్ లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న ఘంటసాలకు చెందిన దేవరకొండ రాకేష్ కుమార్ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. క్విన్స్ నుంచి అష్టకష్టాలు పడి పోలెండ్ కు చేరుకోగా, బుధవారం రాత్రి 10 గంటలకు ఇండిగో ఫ్లైట్ లో ఢిల్లీకి బయలుదేరినట్లు రాకేష్ కుమార్ తెలిపారు. ఉక్రెయిన్ లో భీతావహ పరిస్థితుల నుంచి బయటపడి క్షేమంగా ఢిల్లీ చేరినట్లు విద్యార్థి వివరించారు. పోలాండ్ నుంచి మొత్తం 600 మంది భారతదేశానికి రాగా, కళాశాలకు సంబంధించి మొత్తం 30 మంది విద్యార్థులు ఇండిగో ఫ్లైట్ లో తనతోపాటు వచ్చినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa